top of page

మా మిషన్

భారత దేశాన్ని పునరుత్థానం చేయాలన్న మా లక్ష్యం పౌరుల భాగస్వామ్యం,  ప్రజా సంప్రదింపులు మరియు నవ్యత, సాంకేతికత ద్వారానే సాధ్యం అవుతుంది.

 

మా దృష్టి ప్రతి జిల్లా నైపుణ్యాలని సంధానిస్తూ పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ నాయకుల్లో జవాబుదారీతనం పెంపొందించి తద్వారా సమాజ అభివృద్ధి సాధించడం పైనే ప్రధానంగా వుంది. అలుపులేని కార్యదక్షతతో సుపరిపాలనకై పరిశ్రమించి రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చటమే మా యొక్క మిషన్.

ఈ కష్టతరమైన లక్ష్యం వెనుక సమాజం లోని ప్రతి వర్గాన్ని స్వయం సమృద్ధిగా మలచి వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దడం అనే మా కల దాగుంది.

ప్రస్తుత భారత దేశం సంధి కాలంలో వుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన కళ్ల ముందర అందుకోమని చేతులు జాపి నిలబడింది. అది అందుకోవాలంటే యువత లో  నైపుణ్యాన్ని పెంచి వారి స్వీయ అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధించడం ఎంతో అవసరం.

 

ఇది చేజారిపోతే భావితరాలకు తీరని అన్యాయం చేసినవారం అవుతాము. అందుకే సరిగ్గా ఈ సంధి కాలంలో మన పార్టీ పై లక్ష్యాన్ని మిషన్గా చేసుకొని మీ ముందుకు వచ్చింది.

bottom of page