top of page
  • Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - ఎయిడెడ్ పార్ట్ టైమ్ లెక్చిరర్ల సమస్యలపై సంఘ నాయకులతో భేటీ అయిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ



జీవో 42, 35 రద్దు చేయాలి : పార్ట్ టైమ్ లెక్చిరర్ల సమస్యలపై సీఎంని కలుస్తా : - జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ.

విజయవాడ: ఎయిడెడ్ పార్ట్ టైమ్ లెక్చిరర్ల సమస్యలపై సంఘ నాయకులతో భేటీ అయిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, వారి డిమాండ్లను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. సీఎంని కలిసి రెండు జీవోల రద్దు కోరతామన్నారు. విజయవాడలో శనివారం జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో లెక్చరర్ల సంఘం నాయకులతో జేబీఎన్ పి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు సమావేశం అయ్యారు. జీవో నెం 42, 35లను రద్దు చేసి, పార్ట్ టైమ్ లెక్చిరర్లను క్రమబద్ధీకరించాలని జేడీ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేసి సంప్రదాయ కోర్సులను కొనసాగించాలని కోరారు. తెలుగు భాష విద్యకు ప్రాధాన్యం కొరవడొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎయిడెడ్ పార్ట్ టైం లెక్చిరర్ సంఘం నాయకులు నాగర్ రసూల్, జై భారత్ లీగల్ సెల్ అధ్యక్షుడు మహంత్ నాయర్ పాల్గొన్నారు.

2 views0 comments

Comments


bottom of page